ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగిన మత్తులో స్నేహితుడిని గాయపరిచిన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:16 PM

కృష్ణా  జిల్లా, పాములలంకలో మద్యం మత్తులో స్నేహితుడిపై చాకుతో దాడి చేసి గాయపరిచిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు గురువారం తెలిపారు. పాములలంకకు చెందిన పాముల హర్షవర్ధన్‌(19), మోటూరి మధుబాబు స్నేహితులు. బుధవారం రాత్రి వారి మధ్య వివాదం చెలరేగటంతో హర్షవర్ధన్‌పై మధుబాబు చాకుతో దాడికి పాల్పడ్డాడు. హర్షవర్ధన్‌ పొట్టపై గాయమైంది. ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని, బాధితుని ఫిర్యాదు మేరకు మధుబాబుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa