ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెప్పినవన్నీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 10:32 AM

సీఎం జగన్ పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌జ‌లకు  ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశార‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో అందించిన ప‌రిపాల‌న‌కు సంబంధించి పౌర స్పంద‌న తెలుసుకునేందుకు వ‌చ్చాం. పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌లు, పాల‌న‌కు సంబంధించి మెరుగ‌యిన మార్పులు జ‌న జీవ‌న స్రవంతిని తెలుసుకునేందుకు వ‌చ్చాం. వైయ‌స్‌ జగన్ పాదయాత్ర లో వచ్చినప్పుడు ఆ రోజు చెప్పినవన్నీ, వాటితో పాటే ప‌రిశీల‌న‌లో ఉన్న మ‌రికొన్నింటినీ జ‌త చేసి తూచ తప్పకుండా అమలు చేశాం. దేశంలో ఇంకే రాష్ట్రాలు ఏపీ మాదిరి ఇవాళ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేయలేదు. రాజ్యాంగంలో పొందుప‌రిచిన విధంగా ఆదేశ సూత్రాలు పాటిస్తూ పౌరులంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు ప‌క్ష‌పాత ధోర‌ణికి తావివ్వ‌కుండా అందిస్తున్న ఘనత మనది అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa