టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ చేపట్టిన బంద్ నేపథ్యంలో తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలు, నిరసనలపై ముఖ్యనేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రివ్యూ నిర్వహించారు. ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలపై యువనేత చర్చించారు. పార్టీ నేతల సూచనలు, ఫీడ్ బ్యాక్ మేరకు తదుపరి ప్రణాళికకు రూపకల్పన చేయనున్నారు. బంద్కు మద్దతు ఇచ్చి నిరసనల్లో పాల్గొన్న జనసేన, సీపీఐ కార్యకర్తలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు దౌర్జన్యాన్ని ఎదుర్కొని బంద్ నిరసనల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలను యువనేత అభినందించారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేసినప్పటికీ క్యాడర్ నిరసనల్లో పాల్గొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa