ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాట్సాఫ్ .. బంగ్లా ప్రధానికి రిషి సునక్ ఇచ్చిన గౌరవానికి నెటిజన్లు ఫిదా.

national |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2023, 10:20 PM

జీ20 సదస్సులో పాల్గొనడం కోసం తొలిసారి యూకే ప్రధాని హోదాలో భారత్ వచ్చిన రిషి సునక్ అందరి దృష్టిని ఆకర్షించారు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీ చేరుకున్న రిషి తనకున్న భారత మూలాలతో ఇక్కడి మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఆదివారం ఉదయాన్నే జీ20 సదస్సుకు వెళ్లడానికి ముందు.. అక్షర్‌ధామ్ ఆలయానికి వెళ్లిన యూకే ప్రధాని దంపతులు హారతి ఇచ్చి పూజలు చేశారు. అక్షర్‌ధామ్ ఆలయ ప్రాంగణంలో రిషి సునక్, అక్షతామూర్తి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.


వీటన్నింటి కంటే ఎక్కువగా బంగ్లాదేశ్ ప్రధానితో రిషి సునక్ మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో షేక్ హసీనాతో రిషి సునక్ భేటీ అయ్యారు. 75 ఏళ్ల షేక్ హసీనా కుర్చీలో కూర్చొని ఉండగా.. ఆమె కొడుకు వయసున్న రిషి సునక్ (43) గౌరవంతో మసులుకున్న తీరు అబ్బురపరిచేలా ఉంది. హసీనాకు దగ్గరగా వెళ్లి.. ఓ మోకాలిని నేలకు ఆనించి.. తన చేతిని హసీనా కూర్చున్న కుర్చీపై ఉంచి.. రిషి సునాక్ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు.


యూకే లాంటి ఓ బలమైన దేశానికి ప్రధానిగా ఉన్న రిషి.. తన హోదాను పక్కనబెట్టి.. ఏ మాత్రం ఇగో లేకుండా ఇలా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు కుయుక్తులు, యుద్ధాలతో భారత్‌ను బ్రిటిషర్లు గెలిస్తే.. ఇప్పుడు భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాని తన ప్రేమతో నెటిజన్ల మనసును గెలుచుకుంటున్నాడు. యూకే ప్రధాని హార్ట్ టచ్ చేశాడంటూ.. నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


మరో విశేషం ఏంటంటే.. సాధారణ డ్రెస్‌లో భారత్‌లో అడుగుపెట్టిన రిషి సునక్ భార్య అక్షతా మూర్తి.. తిరుగు ప్రయాణం సమయంలో భారత సంప్రదాయ వస్త్రాధరణ అయిన చీరకట్టులో కనిపించారు. ఏ హోదాలో ఉన్నా.. ఏం చేస్తున్నా సరే భారతీయ మూలాలను మర్చిపోలేదని ఈ దంపతులిద్దరూ చాటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa