అలిపిరి నడక మార్గంలో గత రెండు మాసాల్లో రెండు దురదృష్టకర ఘటనలు జరిగాయన్నారు సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న నడకమార్గంలో గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయని.. అయితే రెండు నెలలుగా అలిపిరి నడకమార్గంలో నిఘా పెంచామన్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఇటీవల పరిణామాలను వివరించారు. త్వరలోనే అలిపిరి నడకమార్గంలో వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ట్రాప్ కెమెరాల ద్వారా నడక మార్గంలో చిరుత, ఎలుగు బంట్ల సంచరించడాన్ని గుర్తించామన్నారు.
నడక, ఘాట్ రోడ్డుల్లో ఆంక్షలు కొనసాగుతాయని సీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి. నడక మార్గం, ఘాట్ రోడ్డుల్లో వన్యమృగాల సంచారం తగ్గే వరకూ ఆంక్షలు ఇలాగే కొనసాగుతాయన్నారు. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించామని.. ఇంకా ఐదు చిరుతలు సంచరిస్తునట్లు గుర్తించామని వివరించారు. నడక మార్గంలో వ్యర్థ పదార్ధాల కారణంగానే జంతువుల సంచారం పెరిగిందని.. అందుకే కాలిబాట మార్గంలో ఇరువైపులా 20 మీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని చదును చేశామన్నారు.
ఇలా నేలను చదును చేయడం ద్వారా జంతువుల సంచారాన్ని భక్తులు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవుతారన్నారు. త్వరలోనే అత్యధునాతన టెక్నాలజీతో ఉన్న 500 కెమెరా ట్రాప్లను నడకమార్గంలో ఏర్పాటు చేస్తామన్నారు. 130 మంది అటవీ సిబ్బందితో నడకమార్గంలో నిఘా పెట్టామన్నారు. ఘాట్ రోడ్డు, నడక మార్గంలో పలు చోట్ల అండర్ పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. చిరుతల సంచారం, ఆ తర్వాతి పరిణామాలతో తిరుమల నడక మార్గం, ఘాట్ రోడ్డుల్లో టీటీడీ, అటవీశాఖ కొన్ని నిబంధనల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 12 ఏళ్ల వయసులోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 వరకే నడక మార్గంలో అనుమతిస్తున్నారు.. రాత్రి 10 తర్వాత నడక మార్గంలో ఎవరికీ అనుమతి లేదు. అలాగే ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 తర్వాత బైక్లను అనుమతించడం లేదు. అంతేకాదు నడక దారిలో ఉన్న షాపుల్లో కూరగాయల అమ్మకాలను నిషేధించారు. అలాగే బయట వ్యర్థ పదార్థాలను పడేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు భక్తులకు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఓ చేతి కర్రను కూడా టీటీడీ అందిస్తోంది. ఇలా భక్తుల రక్షణ కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాందు లక్షితను చిరుత చంపిన ఘటన తర్వాత బోన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని బంధించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa