ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి కార్యకలాపాలకు శంఖుస్తాపనలు చేసిన మంత్రి ధర్మాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 11:56 AM

శ్రీ‌కాకుళం జిల్లా, భైరి గ్రామంలో రూ. 2.41 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌ట్టిన ప‌లు ప‌నుల‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు  ప్రారంభించారు. ఇందులో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం,రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం,రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్లు,రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవన ప్ర‌హ‌రీగోడ ఉన్నాయి. వీటితో పాటే రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు,రూ.20 లక్షలతో నిర్మించిన సామాజిక మరుగు దొడ్లు,రూ.30 లక్షలతో తోట గోర్జికి పోయేందుకు  నిర్మించిన సీసీ రోడ్లు ఉన్నాయి. ఎస్సీ కాలనీకి రెండు లక్షలతో తాగునీటి స‌ర‌ఫ‌రా ఏర్పాటు, మరో రూ.10 లక్షలతో డ్రైన్లు ఉన్నాయి. అలానే రూ.67.6ల‌క్ష‌ల‌తో త్రాగు నీటి టాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa