రేపు అనగా 19.09.2023 ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగునీరందించే పథకాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా డోన్ చేరుకుంటారు, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa