రుతుపవనద్రోణి తూర్పుభాగం ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీంతో ఆదివారం పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం, అనకాపల్లిలో 71.25 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 19వ తేదీకి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa