ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఈ జిల్లాలో వర్షాలు.....వాతావరణశాఖ సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 02:42 PM

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనద్రోణి తూర్పుభాగం ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీంతో రుతుపవన కరెంట్‌ బలపడడంతో ఆదివారం పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 19వ తేదీకి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయంటున్నారు.


రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. మరో వైపురాష్ట్రంలో ఎండతీవ్రత కొనసాగింది. ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒంగోలులో 37.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 78.4 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లా సత్యవేడులో 75.4, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంలో 72.4, చిత్తూరు జిల్లా పుంగనూరులో 70.2, శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో 56.2, తిరుపతి జిల్లా పాకాలలలో 45.2, శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరులో 43.4, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో 43.4, శ్రీ సత్యసాయి జిల్లా చిలముత్తూరులో 41.6, శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో 38.6, ఏలూరు జిల్లా నూజివీడులో 36.2, చిత్తూరు జిల్లా వెంకటగిరికోటలో 35.4, చిత్తూరు జిల్లా పలమనేరులో 33.2, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 33.2, తిరుపతి జిల్లా తడలో 32.6, శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవచెరువులో 28.4, పార్వతీపురంలో 28.4, తిరుపతి జిల్లా తొట్టెంబేడులో 25.4, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో 22.4, ఏలూరులో 22.4, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 20.4, చిత్తూరులో 20.2, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 20.2, విశాఖపట్నం 20,


చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. గుడుపల్లె మినహా 30 మండలాల్లో వాన దంచికొట్టింది. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు.. పుంగనూరు మండలంలో 70.2, నిండ్రలో 66.6, పులిచెర్లలో 59.8, పెనుమూరులో 53.6, పెద్దపంజాణిలో 53.2, గుడిపాలలో 48, యాదమరిలో 44.4, పూతలపట్టులో 43.2, బంగారుపాళ్యంలో 40, చౌడేపల్లెలో 39.6, సోమలలో 38.2, రొంపిచెర్లలో 38, గంగవరంలో 36.4, గంగాధరనెల్లూరు.. వి.కోటలో 35.4, పలమనేరులో 33.2, వెదురుకుప్పం.. తవణంపల్లెలో 30.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.


అనకాపల్లిలో కూడా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో కూడా వాన పడింది. అలాగే రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మంగళవారం నుంచి మళ్లీ వానలు మరింతగా ఊపందుకుంటాయంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa