కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బంగారం పంచాయితీ ఆస్తికరంగా మారింది. ఎమ్మిగనూరు నుంచి ఆదోని మీదుగా కర్ణాటకలోని బళ్ళారికి వెళ్లేందుకు ఇద్దరు మహిళలు బస్సు ఇక్కారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల సంచిలో ఉంచిన రూ.లక్షలు విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎమ్మిగనూరుకు చెందిన పర్వీన్, ఆమె వదిన సాజిదా ఆదివారం ఉదయం కర్నూలు ఆర్టీసీ డిపోకు చెందిన కర్నూలు-బళ్ళారి వెళ్లే బస్సు ఎక్కారు. ఆదోని బస్టాండుకు చేరుకున్న సమయంలో పర్వీన్ పక్కనే సీటులో కూర్చొన్న ఇద్దరు మహిళలు ఆదోని బస్టాండులో దిగి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి పర్వీన్ బ్యాగు తెరచి ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. పది తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు గుర్తించారు. ఆర్టీసీ బస్సును నేరుగా ఆదోని రెండో పట్టణ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు ఎమ్మిగనూరులో బస్సు ఎక్కారని.. అక్కడే చోరీ జరిగి ఉంటోందని.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని అక్కడి నుంచి పంపారు.
బాధితులు ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్కు వెళ్లగా అక్కడా ట్విస్ట్ తప్పలేదు. ఆదోని పోలీసుస్టేషన్కే వెళ్లాలని అక్కడి పోలీసులు సలహా ఇచ్చారు. అసలే జరిగిన ఘటనపై కనీసం విచారణ చేపట్టకుండా తమ పరిధి కాదంటే.. తమది కాదని బాధితులను అయోమయంలోకి నెట్టేశారు. ఏం చేయాలో తెలియని బాధితులు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa