కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్నులో 216 జాతీయరహదారి పక్కన చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ, జనసేన నాయకులు రిలే నిరాహార దీక్ష చేశారు.పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కాగిత కృష్ణప్రసాద్, జనసేన నాయకుడు యడ్లపల్లి రామ్సుధీర్ మాట్లాడారు. జగన్ లక్ష కోట్ల స్కామ్లో దిట్టయితే అదే బాటలో జోగి ఉన్నారన్నారన్నారు. చెరువుల తవ్వకాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పాస్పుస్తకాలు, మట్టితోలకాల్లో సొంత నాయకుల దగ్గర లంచాలు గుంజిన ఘనత జోగికే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రూ.90 లక్షల ఆస్తిని చూపిన జోగి మైలవరంలో రూ.20 కోట్ల విలువైన ఇల్లు ఎలా కట్టాడని ప్రశ్నించారు. ఈనాలుగేళ్లల్లో జోగి అవినీతి రూ.3వేల కోట్లకు పైమాటేనన్నారు. అవినీతి మరక లేని పవన్కల్యాణ్పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తరిమితరిమి కొడతామని, నియోజకవర్గంలో తిరగ నివ్వబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీ, జనసేనలేదేనని ధీమా వ్యక్తం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa