బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము సకల మత ప్రార్థనలు నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ తల్లికి చీర, సారే సమర్పించారు. కొండలమ్మ తల్లి ఆలయంలో టీడీపీ నేత ప్రత్యేక పూజలు చేశారు. ఆపై కౌతవరం మినార్ మసీద్ సందర్శించి మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి గుడ్లవల్లేరు ఆర్సీఎమ్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తరువాత గుడ్లవల్లేరు సంత బజార్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు న్యాయ సంబంధమైన చిక్కుల నుంచి విముక్తి కలగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలందరి ప్రార్థనలతో టీడీపీ అధినేత నిర్దోషిగా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa