ప్రభుత్వం అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని సీమెన్స్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారని, సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబుని అరెస్ట్ చేసారని మార్కాపురం మాజీఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలలో సీఎం జగన్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు స్థానిక తర్లుపాడు రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో అయన పాల్గొన్నారు. కార్య క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పొదిలి నాయకులు గునిపూడి భాస్కర్, కాటూరి పెద్దబాబు, ఓబులరెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa