ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిగామలో కాస్ట్‌లీ వినాయకుడు,,,రూ.కోటిన్నరతో అలంకరించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2023, 06:20 PM

దేశవ్యాప్తంగా వినాయక మండపాల సందడి కనిపిస్తోంది. వినాయక చవితి రోజున మొదలయ్యే పూజలు నిమజ్జనం వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా మండపాలను వినూత్నంగా అలంకరించి భక్తులు తమన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కోటిన్నర రూపాయల కరెన్సీ నోట్లతో నందిగామ వాసవీ మార్కెట్‌ గణపతిని అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఏటా కోటి రూపాయలతో అలంకరించడం ఆనవాయితీ కాగా, ఈసారి కోటిన్నర వెచ్చించారు.


వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ మండపం ఏర్పాటు చేశారు. స్వామివారిని మొత్తం రూ.1.50 కోట్ల కరెన్సీ నోట్లతో ధనపతిగా అలంకరణ చేశారు. 41వ వార్షికోత్సవంలో భాగంగా రూ.500, రూ.200, రూ.50 కొత్త కరెన్సీ నోట్లతో స్వామి వారి విగ్రహం, మండపాన్ని అలంకరణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారి అలంకరణకు కావలసిన నగదును సేకరించి వినాయక మండపాన్ని అలంకరించారు. 41 ఏళ్ల నుంచి వీళ్లు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కరెన్సీ వినాయకుడిని వీక్షించడానికి నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa