ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనతాదర్శన్‌ వలన పేదలకి న్యాయం జరగదు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 04:41 PM

కర్ణాటక రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం ఏకకాలంలో జనతాదర్శన్‌ ఏర్పాటు చేశారు. కోలారులో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యులుగా మంత్రి బైరతి సురేష్‌ హాజరుకాగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. జనతాదర్శన్‌ ప్రారంభం కాగానే బీజేపీ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ....  భూకబ్జాదారులను పక్కన పెట్టుకుని జనతాదర్శన్‌ చేస్తున్నారని, పేదలకు న్యాయం ఎలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.  బంగారపేట పరిధిలో గోమాళ భూములు ఆక్రమించుకుని లేఅవుట్‌ నిర్మిస్తున్నారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. సదరు పత్రాలను బహిరంగం చేస్తానని సవాల్‌ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa