చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని ప్రజలందరికీ తెలుసన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని.. ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించారు. 19 రోజులుగా టీడీపీ కుటుంబ పెద్ద అయిన చంద్రబాబును నిర్బంధించారని.. ఏం తప్పు చేశారని ఆయన్ను నిర్బంధిచారని ప్రశ్నించార. 45 ఏళ్ల నుంచి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉన్నారని.. రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు.
ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా.. ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా అన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడం తప్పా.. స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లలో శిక్షణ పొంది యువత లక్షలు సంపాదిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల మందికి చంద్రబాబు దారిచూపించారన్నారు. పాడేరు ఏజెన్సీలో కూడా స్కిల్డెవలప్మెంట్లో వేలాది మంది శిక్షణ పొందారన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని.. మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డుపైకి వస్తున్నారని భువనేశ్వరి అన్నారు. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు కోసం శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న మహిళలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
సృష్టికి మూలమైన మహిళలను అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని.. మైకులు పట్టుకుపోయినా పాదయాత్ర ఆగలేదన్నారు. మాజీ ఎంపీ తోట సీతామహలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే హత్యానేరం కేసు పెట్టారని.. పోలీసులు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంద్రప్రదేశ్.. సత్యమేవ జయతే అంటూ నినదించారు భువనేశ్వరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa