అవినీతి చంద్రబాబు కోసం కంచాల మోతనా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... టీడీపీ వారు ఏదో కంచాల మోత మోగించారు. నేను మూడు ప్రశ్నలు సంధిస్తున్నాను.
1. లంచాలు తీసుకుని కంచాలు కొడతారా?
2. బకాసురుడి బావమరిదిలు శ్రీకృష్ణుడి వేషం వేస్తారా?
3. అవినీతికి పాల్పడి సిగ్గు పడాల్సిన వారంతా సింగారం చేసుకుని బయటకు వచ్చి కంచాలు మోగిస్తారా?
ఇది టీడీపీ నాయకత్వం, కార్యకర్తలు తెలుసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు, 5 ఏళ్లపాటు మోగించిన అవినీతి ఏదైతే ఉందో.. ఆ అవినీతి మోత వల్లనే చంద్రబాబుగారి ఇంట్లో ఈగల మోత.. జైల్లో దోమల మోత అన్నట్లుగా ఉంది. అందుకే ఆయన ఈరోజు ఈ పరిస్థితికి దిగజారాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అరెస్టు చేసింది సీఐడీ. ఇది నిర్వివాదాంశం. ఆ కేసును, అరెస్టును, రిమాండ్ను క్వాష్ చేయడానికి సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, వారికి రిలీఫ్ దొరకలేదు. అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే, చంద్రబాబుగారు ఈరోజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇది ఆయన తెలుసుకోవాలి. కంచాలు ఎవరి కోసం మోగించారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమా? రాష్ట్రం కోసమా? దేశం కోసమా? విజిళ్లు ఊదారు. హారన్లు మోగించారు. ఎవరి కోసం అవన్నీ..అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa