ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల త్యాగాలు వృధా కావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 05:01 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తనను పరామర్శించేందుకు వచ్చిన అమరావతి రైతులతో నారా భువనేశ్వరి ముచ్చటించారు. అమరావతి రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. రైతుల త్యాగాలు వృధా కావన్నారు. ప్రభుత్వం అడ్డదారిలో వస్తోందని.. మనం ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కోవాలని సూచించారు. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు తమకు కొండంత ధైర్యాన్ని ఇస్తోందన్నారు. ఓట్ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... అదే మన ఆయుధమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa