ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పెద్దల మద్దతుతోనే జగన్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రంలోని బీజేపీని ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం అభినందనీయం. గతంలో తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్లే జగన్.. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులు వేయడానికి వెళ్తున్నారు. లోకేశ్ 20 రోజులు ఢిల్లీలో ఉన్నా రెండు నిమిషాల సమయం కేటాయించని కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జగన్తో మాత్రం గంటలకొద్దీ భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఈ విషయాలన్నింటినీ అవగాహన చేసుకుని త్వరలోనే సరైన పంథాలోకి వస్తారన్న ఆశిస్తున్నా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేస్తోంది’’ అని రామకృష్ణ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa