ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో నుంచి మిస్ అయిన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు,,,,ఇంట్లోని ట్రంకు పెట్టెలో శవాలుగా

Crime |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 11:04 PM

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో తీవ్ర విషాద చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబంలోని ముగ్గురు ఆడ పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. రోజూలాగే పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికి వచ్చి చూసే సరికి తమ ముగ్గురు కుమార్తెలు కనిపించలేదు. ఆ చుట్టు పక్కల వెతికిన తర్వాత వారు కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదే ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెలో వారి ముగ్గురు పిల్లలు మృతదేహాలుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ ముగ్గురు పిల్లల తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


పొట్టకూటి కోసం ఆ కుటుంబం పంజాబ్‌లోని జలంధర్ జిల్లాకు వలస వచ్చింది. ఆ భార్యా భర్తలకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. అందులో 9 ఏళ్ల అమృత, 7 ఏళ్ల శక్తి, 4 ఏళ్ల కాంచన అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే రోజూ లాగానే పనికి వెళ్లిన వారి తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి కాంచన, అమృత, శక్తి కనిపించలేదు. అయితే వారు నివసించే ఇంటి చుట్టు పక్కల వెతికినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో దగ్గర్లో ఉన్న మక్సుదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తప్పిపోయిన చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు.


అయితే ఆచూకీ కనిపించకుండా పోయిన పిల్లల తండ్రి మద్యానికి బానిస కావడంతో ఆ ఇంటి యజమాని వారిని ఇల్లు ఖాళీ చేయాలని ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలోనే వారు ఇంట్లోని సామాన్లు సర్దుకుని బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టె బరువు సాధారణం కన్నా బాగా ఎక్కువగా అనిపించింది. వెంటనే అనుమానం వచ్చి ఆ ట్రంకుపెట్టెను తెరిచి చూడగా వారంతా షాక్ అయ్యే సంఘటన అక్కడ కనిపించింది. అదేంటంటే తప్పిపోయిన కాంచన, అమృత, శక్తి ముగ్గురు చిన్నారులు ఆ ట్రంకు పెట్టెలో విగత జీవులుగా పడి ఉన్నారు. అది చూసి వారంతా షాక్ అయ్యారు.


వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ చిన్నారుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ట్రిపుల్ మర్డర్‌ స్థానికులను తీవ్రంగా భయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురు చిన్నారుల హత్యకు వారి తండ్రే కారణమని వారు ఆరోపణలు వ్యక్తం చేశారు. మద్యానికి బానిసైన వారి తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు.. ఆ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa