ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ కళ్యాణ మండపాల్లో ఇక నుంచి ఈ రూల్ పాటించాల్సిందే,,,,డీజేలు, సినిమా పాటలను అనుమతించమన్న టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 06:40 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించినున్నామని, భక్తులు తమకు ముఖ్యమైన రోజుల్లో స్వయంగా ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా సినిమా పాటలు, డీజేలకు ఆస్కారం లేదని చెప్పారు. సినిమా, డీజేపీ పాటలకు బదులుగా భక్తి గీతాలు, లలిత గీతాలను పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. టీటీడీ కళ్యాణ మండపాల్లో వేడుకలు, వివాహాలు జరిపించేవారు డీజేలు, సినిమా పాటలను పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది టీటీడీ పవిత్రతకు దెబ్బతీస్తుందనే వాదన ఇంది. ఈ నేపథ్యంలోనే తాజా సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఇక, టీటీడీకి తెలుగు రాష్ట్రాల్లో 250కిపైగా కళ్యాణ మండపాలు ఉన్నాయి. వీటిని అందుబాటు ధరలతో వివాహాలు, వేడుకలకు అద్దెకు ఇస్తుంటారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే రూ.5,000, జిల్లా కేంద్రంలో ఉంటే రూ.4,000, మండల కేంద్రం (పెద్దవి) రూ.1,500, చిన్నవి రూ1,000, మున్సిపాల్టీల్లోని రూ.2,000 మాత్రమే వసూలు చేస్తారు. ప్రయివేట్ ఫంక్షన్ హాల్స్‌ ధరలతో పోల్చితే టీటీడీ కళ్యాణ మండపాలు చాలా తక్కువలోనే అద్దెకు తీసుకోవచ్చు. సోమవారం జరిగిన సమావేశంలో టీటీడీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయిం తీసుకున్నారు. దీని వల్ల 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెరగనున్నాయి. టీటీడీ పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 % పెంచేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది ఈ అక్టోబరు నుంచే అమలుకానుంది. కార్పొరేషన్‌లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పొందితే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఈఏస్ఐ వర్తించని 1500 మంది ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.


అలాగే, నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్ల ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయింపు.. నారాయణగిరిలో హోటల్స్‌, అన్నమయ్య భవన్‌లో హోటల్స్‌ను టూరిజం శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఆకాశ గంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రహదారి, వరాహస్వామి అతిథి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ.10.8 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. తిరుపతిలోని చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు రూ.25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.


టీటీడీ పరిధిలోని 3,259 మంది పాఠశాల విద్యార్థులుకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించేందుకు చర్యలు. ఇదే సమయంలో టీటీడీ కళ్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డీజేలకు బదులుగా లలిత గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ ప్ర‌సాద్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని నిర్ణ‌యం. తిరుమలలో 63 ఏళ్ల కిందట నిర్మించిన గాయత్రీ సదన్‌, శ్రీవారి కుటీర్‌, టీబీసీ-53, టీబీసీ-64 తదితర 13 విశ్రాంతి గృహాలను కాటేజి డొనేషన్‌ స్కీమ్‌ కింద పునర్నిర్మాణం చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపారు. ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్‌లో ఒక శాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa