టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రిలే నిరాహార దీక్షలు, పాదయాత్రలు, సర్వమత ప్రార్థనలు, ‘బాబుతో నేను’ పేరిట సంతకాల సేకరణ, ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, రచ్చబండ సభలు,అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. టీడీపీ నేతలు వారివారి నియోజకవర్గాలలో తనదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా నగరిలో గాలి భానుప్రకాశ్ జలదీక్ష, అద్దంకిలో ఎమ్మెల్యే రవికుమార్ కొత్తూరు నుంచి కొమ్మినేనివారిపాలెం వరకు భారీ సైకిల్ ర్యాలీ, కంచికచర్లలో కోగంటి బాబు ఆధ్వర్యంలో నల్ల బెలూన్లుతో నిరసన, కర్నూలు జిల్లా బూరారెడ్డిపల్లిలో అఖిలప్రియ, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అలానే ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ నేతలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. టీడీపీ నేతలు తలపెట్టిన కార్యక్రమాలకి జనసేన, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa