ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీలను మోసం చేసింది జగనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 03:12 PM

మాజీ మంత్రి, టీడీపీ నాయకులూ యనమల రామకృష్ణుడు, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. అయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవారికి ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ నేతలు  రాష్ట్రంలో వనరులన్నీ దోచుకున్నారని ఆరోపించారు. పూర్తికాని ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేస్తూ పేద ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ అధికారంలో నుంచి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ మోసం చేశారని మండిపడ్డారు.హౌసింగ్ నిర్మాణాలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa