జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు -2 సచివాలయం పరిధిలోని ఎస్సీ కాలనీ,తూర్పు బజార్ నందు రాష్ట్ర ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో నూతన కాంతులను నింపుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఎటు చూసినా సమస్యలే ఎక్కువగా కనపడేయని నేడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో అలాంటి సమస్యలు లేకుండా ప్రగతి బాటలో నడుస్తున్నాయి అని అన్నారు,నవరత్నాల ద్వారా వైయస్ఆర్ చేయూత, ఆసరా, సున్న వడ్డీ, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa