టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. అధిష్ఠానం పిలుపు మేరకు ‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట ఆదివారం రాత్రి నిరసనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ప్రజాసదన్ కార్యాలయంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చేతికి సంకెళ్లు వేసుకుని వైసీపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ప్రజల మద్దతుతో త్వరలో చంద్రబాబునాయుడు నిర్దోషిగా బయటపడతారని తెలిపారు. శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్ వద్ద మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేతికి రిబ్బన్లు, తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. సైకో పాలనలో మంచివారిని వేధించడం.. ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం.. న్యాయం కోసం పోరాడితే దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారని కార్యకర్తలు నినదించారు. చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa