ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పర్యటనలో నిరసన తెలిపే దిశగా గంటా అడుగులు , అడ్డుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 03:43 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా విశాఖలో నల్ల బెలూన్లు ఎగురవేత కార్యక్రమానికి గంట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే వినతిపత్రాలు తీసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. జగన్ విశాఖ పర్యటనలో అవేమీ లేవని.. పైగా ప్రతపక్షాలను నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa