ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుషికొండపై అక్రమానిర్మాణాలపై సుప్రీం కోర్ట్ కైనా వెళ్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 09:55 AM

రుషికొండపై భవన నిర్మాణాలకు సంబంధించిన ఉల్లంఘనలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్తామని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ.. రాజధాని మార్పుపై సీఎం జగన్‌, మిలట్రీ రెడ్డి, మంత్రులు ఇచ్చిన ప్రకటనలన్నీ కోర్టుధిక్కరణే అవుతాయన్నారు. రుషికొండ భవనాల్లో బాత్‌ టబ్‌ ఖరీదు రూ.25 లక్షలు, ఒక్క కమోడ్‌ ధర రూ. 10 లక్షలు అని తెలిసిందన్నారు. ఒక్క టాయిలెట్‌కు 2లక్షలు వేసుకున్నా.. అది ఒక పేదవాడి గృహ నిర్మాణం అంత ఖర్చు అని పేర్కొన్న రఘురామ, కమోడు ధరతో పేదవారి కోసం ఐదు జగనన్న గృహాలు, బాత్‌ టబ్‌ కోసం వెచ్చించిన రూ.25 లక్షల ఖర్చుతో పన్నెండున్నర జగనన్న గృహాల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. రుషికొండపై తనతో పాటు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేస్తే, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa