ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబరు నుండి విశాఖలో ప్రభుత్వ కార్యకలాపాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 09:57 AM

డిసెంబరు నుంచి విశాఖ పరిపాలన కేంద్రంగా మారుతుందని, సీఎం జగన్ వెల్లడించారు. రుషికొండ ఐటీ పార్కులో ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(డీసీ)ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....  విశాఖపట్నం త్వరలో ఐటీ హబ్‌గా మారనుందని అన్నారు. విశాఖ టైర్‌-1 సిటీగా ఎదగడానికి ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో వంటి సంస్థలు దోహదపడతాయన్నారు. అదానీ డేటా సెంటర్‌ 24 నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్‌ చేస్తే చాలని, అండగా ఉంటామని ఇన్ఫోసిస్‌కు సీఎం హామీ ఇచ్చారు. కాగా, విశాఖపట్నంలోని ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని హైబ్రిడ్‌ మోడల్‌గా అభివృద్ధి చేయనున్నట్టు ఆ సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) నీలంజన్‌ రాయ్‌ ప్రకటించారు. స్థానికంగా ప్రతిభావంతులు ఉంటే వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa