దేశంలో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇండక్షన్ స్టవ్లను కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లపై రూ.500 వరకు ఉచిత గ్యాస్ ఆఫర్లు ప్రకటించాయి. మార్చి 31 లోపు పీఎన్జీ కనెక్షన్లు తీసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కేంద్రం సీఎన్జీ వాడుతున్నవారు గ్యాస్ సిలిండర్లు వాడకూడదని, రెండింటినీ కలిగి ఉండటం నిబంధనలకు విరుద్ధమని ఆదేశాలు జారీ చేసింది. అయితే, దేశంలో గ్యాస్ కొరత లేదని, త్వరలో వాణిజ్య సిలిండర్ల సరఫరా మొదలవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa