ఐపీఎల్ 2026లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్కు దిగింది.బౌలింగ్లో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించి బెంగళూరును 155 పరుగులకే పరిమితం చేశారు. నిర్ణీత 19.2 ఓవర్లలోనే ఆర్సీబీ ఆలౌట్ అయింది.ఇన్నింగ్స్ ఆరంభంలో విరాట్ కోహ్లీ తన సహజమైన దూకుడుతో మెరుపులు చూపించాడు. కేవలం 13 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి వేగంగా స్కోరు పెంచాడు. అయితే కగిసో రబడా వేసిన ఒక అద్భుతమైన డెలివరీకి అతను ఔటవడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్కు బ్రేక్ పడింది.మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం చూపిస్తూ పరుగుల వేగాన్ని పూర్తిగా నియంత్రించాడు. కీలక సమయంలో వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు. దేవదత్ పడిక్కల్ 40 పరుగులతో కొంత పోరాటం చేసినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు.ఇప్పుడు 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఛేదించాల్సి ఉంది. ఈ పిచ్పై ఇది పెద్ద కష్టమైన టార్గెట్ కాకపోయినా, ఆర్సీబీ బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు తీస్తే మ్యాచ్లో ఉత్కంఠ పెరిగే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఫామ్లో ఉండటంతో గుజరాత్కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఈ ఛేదన ఎలా సాగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa