చాలా కాలంగా నిష్క్రియంగా ఉన్న ఖాతాలపై Punjab National Bank కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి ఖాతాదారులు వెంటనే తమ KYC వివరాలను అప్డేట్ చేయాలని, లేకపోతే నెల రోజుల్లోపే ఖాతాలను మూసివేస్తామని స్పష్టం చేసింది.బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం, ఇన్యాక్టివ్ ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసుకోవాలంటే 2026 ఏప్రిల్ 15లోగా KYC పూర్తి చేయాలి. గడువు లోపల అప్డేట్ చేయకపోతే, ఏప్రిల్ 16 నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాతాలను క్లోజ్ చేస్తామని వెల్లడించిందిReserve Bank of India మార్గదర్శకాల ప్రకారం, రెండు సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు జరగని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలను ‘ఇన్యాక్టివ్’గా పరిగణిస్తారు. అలాంటి ఖాతాలను మళ్లీ యాక్టివ్ చేయాలంటే KYC తప్పనిసరి.ఖాతాదారులు తమ KYCను బ్యాంక్ బ్రాంచ్లో, ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా లేదా వీడియో KYC (V-CIP) సదుపాయం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. KYC పూర్తి అయిన తర్వాత మాత్రమే ఖాతా మళ్లీ సక్రియమవుతుంది.ఖాతాను యాక్టివ్ చేయడానికి డిపాజిట్ లేదా విత్డ్రాయల్ వంటి లావాదేవీలు చేయడం అవసరం. అదనంగా బ్యాలెన్స్ చెక్ చేయడం, చెక్బుక్ లేదా ATM కార్డ్ కోసం దరఖాస్తు చేయడం, లావాదేవీ పరిమితులను మార్చడం వంటి నాన్-ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా సహాయపడతాయి.ఇక మరోవైపు బ్యాంకులు విధించే జరిమానాలపై కూడా ఆసక్తికర సమాచారం వెలువడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోవడం వల్ల HDFC Bank, Axis Bank, అలాగే పీఎన్బీ వంటి బ్యాంకులు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నాయి.2022-23 నుంచి 2024-25 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) కస్టమర్ల నుంచి కనీస నిల్వ ఉల్లంఘనలపై మొత్తం రూ.8,092.83 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేసినట్లు వెల్లడైంది.మొత్తంగా, ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్గా ఉంచడం, KYC వివరాలను సమయానికి అప్డేట్ చేయడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa