ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 10:07 AM

సోమవారం అనకాపల్లి జిల్లా, పరవాడ లో పర్యటిస్తున్న సీఎం జగన్ ని  వివిధ అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ బాధితులు క‌లిసి వైద్యచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాల‌ని  విన్నవించుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే... కశింకోట మండలం, విసన్నపేట గ్రామ పంచాయతీకి చెందిన యన్. లోకేష్ (13), యన్. గుణసాగర్ (11) ఇద్దరు పిల్లలు తలసేమియాతో బాధపడుతున్నారు, 15 రోజులకు ఒక సారి హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రక్త మార్పిడి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ని కలసి తమ సమస్యను విన్నవించగా ముఖ్యమంత్రి బాధితుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా విని వారితో కాసేపు మాట్లాడి వారిలో మ‌నోధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తూ, మేమున్నామ‌ని ధైర్యం నింపారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తక్షణమే  స్పందించి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి ని ఆదేశించారు.  ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఇద్దరు పిల్లలకు రెండు లక్ష రూపాయలు చెక్ అంద చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa