గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కిపోతుంది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతకు తోడు వర్షాభావ పరిస్థితులు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతవాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోందని.. అది అల్పపీడనంగా మారి ఆగ్నేయ వైపు కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఆ తరువాత మూడు రోజులు పశ్చిమ బెంగాల్ వైపుకు కదులుతూ తుపానుగా మారనుంది.
ఈ నేపథ్యంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు ఏపీలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే బంగాళాఖాతంపై బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ముందుగా తమిళనాడుపై ఆ తరువాత దక్షిణ కోస్తాపై ఉంటుందని అన్నారు. దీని ఫలితంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. సముద్రం అలజడిగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa