ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ద్వారకా తిరుమల ఆలయం మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 03:21 PM

ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 29 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 28న మధ్యాహ్నం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. 29వతేదీ ఉదయం ఆలయం తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం జరగనుంది. ఉత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa