ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసమానతలు లేని అభివృద్ధి కోసం బస్సుయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 03:22 PM

ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర నవంబర్‌ 2న మందసలో ప్రారంభించి ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుందని సీపీఎం నాయకుడు హనుమంతు ఈశ్వరరావు తెలి పారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లౌకిక వాదం ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం ఈ బస్సుయాత్ర చేపడుతున్నామని, దీనిని పార్టీ అఖిలభారత నాయకుడు విజ్జు కృష్ణ ప్రారంభిస్తారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతోందని విమర్శించారు. బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నేతలు గొండు నీలన్న, జోగి లక్ష్మణరావు, సీహెచ్‌ వెంకటరావు, కె.అప్పల స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa