ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ డెలివరీ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు ఇవ్వొద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 10:25 PM

ఏపీలో గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది అన్నారు. కానీ గ్యాస్‌ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు. అలా వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ డెలివరీ చేసే బాయ్‌లు రవాణా పరిధిలో నివాసం ఉన్నా కూడా డెలివరీ కోసం అదనపు రుసుము వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల సిలిండర్ డెలివరీ కోసం ఛార్జీల అంశంపై క్లారిటీ ఇచ్చారు. అలాగే వినియోగదారులకు ప్రత్యేక సూచనలు కూడా చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa