పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటవ తేదీన పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో సీఎ్సను ఏపీజేఏసీ అగ్రనాయకత్వం కలిసింది. ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని తన వెంట తీసుకువెళ్ళిన బొప్పరాజు వారిని జవహర్రెడ్డికి పరిచయం చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు రావటం లేదని ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీఎ్సఎ్సఎన్పీ శాస్ర్తీ... సీఎస్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా తమ పెన్షన్ నుంచి డబ్బులు చెల్లిస్తున్నా ఈహెచ్ఎ్సలో వైద్యసదుపాయాలు అందటం లేదన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశ్రీలో ఉన్న చికిత్సలను ఈహెచ్ఎస్లో నూ చేర్పించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఏపీ రెవెన్యూ సర్వీసు అసోసియేషన్ (ఏపీఆర్ఎ్సఏ) విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చినందుకు సీఎస్ జవహర్రెడ్డిని డిప్యూటీ కలెక్టర్లు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాగా, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa