విశాఖ రుషికొండపై నిర్మాణాల వ్యవహారంపై లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిల్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. ముఖ్యమంత్రిని రుషి కొండకు వెళ్లొద్దని అంటున్నారు..ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిల్లో రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇప్పటికే హైకోర్టులో, ఎన్జీటిలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేసింది. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పిటిషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని వ్యాఖ్యానించింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలు , సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైనల్ హియరింగ్ ఉండగా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. విశాఖపట్నం రుషి కొండపై సీఎం క్యాంపు కార్యాలయం, సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అక్టోబర్ 11, 2023న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఏ ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిల్లో కోరారు. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏ విధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. కోర్టు మాత్రం ఈ పిల్ను కొట్టివేసింది.. దీంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని లింగమనేని శివరామ ప్రసాద్ భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa