సినిమా తీశామా.. బ్లాక్ బస్టర్ కొట్టిందా.. వందల కోట్ల క్లబ్లో చేరిపోయామా.. బిజినెస్ పెంచుకున్నామా.. ఇదీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బడా హీరోల కమర్షియల్ లెక్క. అయితే.. ఇందులో కొందరు హీరోలు మాత్రం.. తమకు వచ్చిన మొత్తంలో కొంతలో కొంత తమ అభిమానుల కోసమో, పేద ప్రజల కోసమో, విద్యార్థుల కోసమో ఖర్చుపెడుతూ.. తమలోని సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. అలాంటి హీరోల సరసన చేరిపోయారు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ఖుషి సినిమా.. ఇటీవలే విడుదలై హిట్ టాక్ అందుకుంది. భారీ వసూళ్లను రాబట్టింది. సినిమాకు మంచి లాభాలు రావటంతో.. రౌడీ బాయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను తీసుకున్న రెమ్యూనరేషన్లో కోటి రూపాయాలను.. తన అభిమానుల్లోని 100 కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు.. సక్సెస్ మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రకటించటమే కాదు.. తన అభిమాన సంఘాలు, పీఆర్ టీం కలిసి సర్వే చేసి.. నిజంగా అవసరమున్న వారికి ఆ లక్ష రూపాయాల సాయాన్ని అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆ లక్ష రూపాయల సాయాన్ని అందుకున్న కుటుంబాల్లో వెలుగులు విరబూశాయి. అలా.. లక్ష రూపాయల సాయం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన షర్మల శ్రీ అనే చిన్నారికి అందించారు. గతంలో ఆటో ప్రమాదానికి గురైన చిన్నారి షర్మిల.. తన కాలు పోగొట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి ఆ లక్ష రూపాయల సాయం అందించాలని సర్వే చేస్తున్న సమయంలో.. ఆయన అభిమాన సంఘం నాయకులకు షర్మిల పరిస్థితి తెలిసింది. దీంతో.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా షర్మిలకు చెక్ కూడా అందిచాడు. ఆ డబ్బుతో షర్మిలకు చికిత్స అందించగా.. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలోనే.. విజయ్ దేవరకొండపై ఎంపీ ప్రశంసలు కురిపించారు.
అయితే.. స్వశక్తితో ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ.. చిన్న వయసులోనే పెద్దమనసుతో అభాగ్యులకు అండగా ఉంటున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఆయన ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కాగా.. షర్మిలకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని.. తనకు కాలు పెట్టించటంతో పాటు చదువు విషయంలో కూడా సాయం చేసేందుకు తోడ్పనున్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa