ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గోపాలపట్నం ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిధి ఆటో డ్రైవర్లకు గోపాలపట్నం రైతు బజార్ వద్ద మంగళవారం అవగాహన నిర్వహించారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని ఆటోలు సర్వీస్ రోడ్లులో నడపాలన్నారు. మద్యం సేవించి ఆటోలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa