ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో పాటుగా సంక్షేమానికి కూడా ప్రాధాన్యతగా తీసుకుని పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ కీర్తి పొందారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అయన మాట్లాడుతూ... ఆముదాలవలస నుంచి గెలిచిన తమ్మినేని సీతారామ్ కు సీఎం జగన్ స్పీకర్ గా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అధ్యక్షా అని పిలుచుకునే అవకాశాన్ని కల్పించారని గుర్తు చేసారు. టీడీపీకి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాలని, టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలతో కలసి వచ్చినా సరే సాధించేదేమీ ఉండదన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తొమ్మింటికి ఎనిమిది స్థానాలు గెలవగా, ఈసారి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa