వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ... సామాజిక సాధికార బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోయే అధ్యాయం. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో బడుగు,బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగా చూసిన రాజకీయాలనే చూశాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రాల్లోనూ సామాజిక సాధికారత ఒక నినాదంగానే మిగిలిపోయింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో జగనన్న పాలనలో సామాజిక సాధికారత కళ్ల ముందు కనిపిస్తోంది. జగనన్న కేబినెట్లో మంత్రులుగా 70శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల వారే ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నా పిలిచి మరీ పదవులు ఇచ్చిన జగనన్న పాలన ఓ విప్లవం. ఎప్పుడైతే ఎన్నికలొస్తాయో అప్పుడే బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలు గుర్తుకొస్తారు చంద్రబాబుగారికి. తర్వాత వారిని లెక్కలోకి కూడా తీసుకోరు. –అవకాశం వచ్చినప్పుడల్లా వారిని అవమానించిన చరిత్ర చంద్రబాబుది.ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలతో వెనుకబడిన, బలహీన, పేద గడపల్లో వెలుగులు పంచుతున్న జగనన్న పాలనకు ఎవరైనా జై కొట్టాల్సిందే అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa