తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పొలిటికల్ యాక్షన్ కమిటీ విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్లో ఈ రోజు ఉదయం 11 గంటలకు గురువారం భేటీ కానుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ హాజరవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పనపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అలాగే ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియలో జనసేన భాగస్వామ్యంతో కలిసి పని చేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన ప్రజా పోరాటాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరవు, ధరల పెరుగుదల, వంటి అంశాలపై పోరాడాలని ఇప్పటికే టీడీపీ - జనసేన పార్టీలు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa