చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో మోసం జరిగింది. తానిచ్చే మందులు తింటే సంతానం కలుగుతుందని, ఓ జంటను నమ్మించి మత్తు మందు ఇచ్చి.. బంగారం, నగదు, చరవాణితో పారిపోయిన ఘటన కలకలంరేపింది. బీడీ కాలనీకి చెందిన ఇమ్రాన్, హుష్నా షమీమ్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం కలుగలేదు.. ఈ బలహీనతను గుర్తించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇమ్రాన్కు ఫోన్ చేసి తనను వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. తానే ఇచ్చే మాత్రలు మిగితే సంతానం కలుగుతుందని చెప్పిన మాటలు నమ్మించాడు. మంగళవారం అతడ్ని ఇంటికి పిలిపించారు. బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. కొద్ది సేపు మయ మాటలు చెప్పి.. తన వద్దనున్న మత్తు మందు దంపతులకు ఇవ్వడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే హష్నా షమీమ్ చెవి కమ్మలు, మొబైల్, బీరువాలోని రూ.10 వేల డబ్బులు తీసుకుని ఉడాయించాడు. మాత్రలు మింగిన 1 5నిమిషాల తర్వాత మెలకువ రావడం, అతడు కనిపించకపోవడంతో అనుమానంతో వెతకగా మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం, మొబైల్ విలువ రూ.35 వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa