ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాదెండ్ల మనోహర్ కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 05:46 PM

జనసేన తెలంగాణలో ఒక పార్టీతో, ఏపీలో మరో పార్టీతో సహ జీవనం చేస్తోందని సెటైర్లు వేశారు మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. తెలంగాణ పార్టీ ఆఫీసు నుంచి ఒక ప్రెస్ నోట్, ఏపీ నుంచి మరో ప్రెస్ నోట్ వస్తుంది.. దీంతో నాదెండ్ల మనోహర్ కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడుతున్నారు.. చంద్రబాబు పెట్టిన ఆదరణ పథకం వల్ల బాగుపడిన ఒక కుటుంబాన్ని చూపించమని సవాల్ విసురుతున్నాను.. మనోహర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పశువుల కొనుగోలు కోసం ప్రభుత్వం డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వటం అనే విధానం లేదు.. బ్యాంకులతో ఒప్పందం చేసుకుని రుణాలు పొందుతారు.. వైయ‌స్ఆర్‌  చేయూత, వైయ‌స్ఆర్‌ ఆసరా పథకాల ద్వారా వచ్చిన డబ్బులతో లబ్దిదారులు వాళ్ళకు నచ్చిన విధంగా పెట్టుబడి పెట్టుకుంటారని వెల్లడించారు. జనసేనలో కాస్త ఆలోచించే ఏకైక వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని చాలా మంది అనుకుంటారు.. కానీ, చంద్రబాబు ఇచ్చిన నోట్స్ తో ఇలా మాట్లాడకండి అని మంత్రి సిదిరి అప్పలరాజు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa