సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ....ఒక్క జగనన్న ఫొటో పెట్టుకుని మాత్రమే వచ్చినా... వేలాదిగా తరలివచ్చిన కావలి ప్రజలు, జగనన్న స్థాయి ఏంటో చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదల గుండెల్లో జగనన్న కొలువైవుండటం వల్లే ఈ జనసంద్రం కదిలి వచ్చిందనిపిస్తోంది. ఈరోజు అణగారిన ప్రజలు, బీద బిక్కీ వారు తమ పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. మన ఇంటిదగ్గరే ఆ పనులు అయిపోతున్నాయి. గడప గడపచెంతకు ప్రభుత్వపాలన చేరింది. దేశంలోనే ఇలాంటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న మినహా మరొకరు లేరు. పేదల విషయంలో వైయస్సార్ మనసే జగనన్న మనసు. తండ్రిలానే తనయుడు. ఇద్దరిదీ ప్రజలతో విడదీయలేని బంధం. బీసీలు, ఎస్సీ నాయకులను అవమానించిన, మా మైనార్టీ పిల్లలను దేశద్రోహులని చెప్పి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పిన దుర్మార్గం చంద్రబాబుది అయితే మైనార్టీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలను కల్పించిన మంచితనం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa