సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో, సంక్షేమంలో సమూలమార్పులు తీసుకురాగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏమి చేసాడో ప్రజలు ఆలోచన చేసి గుర్తించాలన్నారు. రాష్ట్రంలో రూ. 4 లక్షల 5వేల కోట్లరూపాయలను 12 కోట్ల 66 లక్షల మంది బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని వెల్లడించారు. కులాలకు,మతాలకు,రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తూ సంక్షేమ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారన్నారు. గిరిజనుల కోసం సీఎం జగన్ రూ. 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారన్నారు. అణగారిన వర్గాలకు ఎల్లవేళలా మంచి జరగాలంటే మళ్లీ మళ్లీ జగన్ సీఎం కావాలని రాజన్నదొర పిలుపునిచ్చారు. అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తూ సామాజిక సంక్షేమం సాగిస్తున్నారని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa