ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే పాలవెల్లువ పై నాదెండ్ల ఆరోపణలు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 05:59 PM

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి చంద్ర‌ముఖిలా మారిపోయార‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు. బీజేపీలో ఉన్న కేడ‌రే ఆమెను విభేదిస్తుంద‌ని చెప్పారు.ఏపీలో మ‌ద్యం అక్ర‌మాలు ఉన్న‌ట్లుగా అనిపిస్తే సీబీఐతో విచార‌ణ చేయించుకోవాల‌ని సూచించారు. నాదెండ్ల మనోహర్, ధూళిపాళ నరేంద్ర కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు అంటూ   మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అమూల్ సంస్థ‌ గ్రాండ్ సక్సెస్.. జగనన్న పాలవెల్లువ కంటే ముందు పాల సేకరణ ధరలు ఏడాదికో, రెండేళ్ళకో పెంచేవారు.. అమూల్ సంస్థ గత మూడేళ్లలో 8 సార్లు పాల సేకరణ ధరలు పెంచిందన్నారు.. దీని వల్ల ప్రైవేటు డెయిరీలకు ధర పెంచక తప్పటం లేదు.. అందుకే పాలవెల్లువ పై నాదెండ్ల, ధూళిపాళ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 3 లక్షల 73 మహిళా రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది.. పాడి రైతులకు 4 వేల 900 కోట్లకు పైగా అదనపు లబ్ది చేకూరిందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa