ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 06:01 PM

 సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ....  దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులుంటే సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే. సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని రుచి చూపించిన వ్యక్తి జగనన్న. 25 మంది మంత్రివర్గం ఉంటే అందులో 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు. స్పీకర్‌ బీసీ, మండలి చైర్మన్‌ ఎస్సీ, మండలి వైస్‌ చైర్మన్‌ పదవి మైనార్టీకి ఇచ్చారు. షణ్ముఖ వ్యూహం అని పవన్‌ అంటున్నాడు. నిజానికి అది చీటర్స్‌ వ్యూహం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్నదమ్ముల ఊపిరి జగనన్న.  చంద్రబాబు, పవన్, లోకేష్, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు.. ఆరుగురు కలిసి వ్యూహం పన్నినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్నదమ్ముల ధాటికి తుడిచి పెట్టుకుపోవడం ఖాయం.  సాధికార యాత్రల్లో జగనన్న కటౌట్‌ చూసే వేలాది మంది తరలి వస్తున్నారు. జగనన్న వస్తే మీరు తట్టుకుంటారా? సునామీ ధాటికి కొట్టుకుపోతారు. ప్రతిపక్షాలు ఏ వ్యూహం పన్నినా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనన్న వ్యూహమే మా వ్యూహం.  నేడు మన పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు. మంచి వైద్యం అందుతోంది.  మోపిదేవి, బోస్, కృష్ణయ్య, మస్తాన్‌రావు.. నలుగురు మన బిసివర్గాల వారు రాజ్యసభ మెట్లు ఎక్కారంటే కారణం జగనన్న. వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్‌కు ఎంపీ సీటు అమ్మేసుకున్నాడు అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa