ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్లో సీఎం జగన్ ఉన్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. సీఎం జగన్ నేడు (నవంబర్ 10) వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని సీఎం వాహనం ముందున్న వాహనం వేగాన్ని డ్రైవర్ అకస్మాత్తుగా తగ్గించడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఘటనలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సీఎం జగన్ రెండు రోజులుగా కడప, అన్నమయ్య జిల్లాల పర్యటనలో ఉన్నారు. నేడు కడప జిల్లా వేముల మండల వైఎస్సార్సీపీ నేతలతో సమీక్ష అనంతరం సీఎం జగన్.. ఇడుపులపాయ ఎస్టేట్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ కాన్వాయ్లో ప్రమాదం వార్త గురించి తెలిసి ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీఎం జగన్ను మరో వాహనంలోకి ఎక్కించి ఇడుపులపాయ ఎస్టేట్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో కడపకు బయల్దేరి వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa